తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 22( ప్రజాజ్యోతి ) ..//.// అడుగుకో గొయ్యి, గజానికో గుంత అన్న చందంగా ఉంది అనంతరం నుండి తిరుమలగిరి కి వెళ్లే దారి.అసలే దారుణంగా ఉన్న రోడ్లు వర్షాకాలపు తొలి ముసురుకే మరింత దయనీయంగా తయారయ్యాయి. రహదారులకు కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్నా ఎక్కువ శాతం రోడ్లు ఇంకా అత్యంత అధ్వానస్థితిలో ఉన్నాయి. నిధులున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పట్లేదు. ప్రధాన కూడలి ప్రాంతాలు, రద్దీ అధికంగా ఉండే దారుల్లోనే చిన్న గుంతలు పెరిగి పెద్దవవుతున్నాయి. వారం నుంచి కురుస్తున్న వానలతో ఇలాంటి గుంతల్లో వాననీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి.ఇప్పటికైనా గుత్తేదారులు ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- 2 views