కుటుంబ పాలన అంతం బిజెపి పంతం మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్

Submitted by mallesh on Fri, 30/09/2022 - 10:59
Revuri Prakash, former BJP MLA, ends family rule


చౌటుప్పల్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి)  .//.మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన, మునుగోడు గడ్డమీద కాషాయపు జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆవరణలో, బిజెపి ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన, శక్తి కేంద్రం 30,32,33,37 వ బూత్ కమిటీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూభారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్తల సైనికుల పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఎన్నికన్నారు. కుటుంబ పాలన అంతమే, బిజెపి పంతం మని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిహెచ్ఎంసి మేయర్ సుభాష్ చంద్రబోస్ జి, కర్నాటి ధనుంజయ రమన గోని శంకర్, ఉబ్బు వెంకటయ్య ,ఉడుగు వెంకటేశం, మోగుదాల రమేష్ గౌడ్ ,కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు, కంశెట్టి భాస్కర్, గోషిక బిక్షపతి, గోషిక పురుషోత్తం, వనం ధనంజయ, మర్రి మహేందర్ రెడ్డి ,ఉప్పు ఆంజనేయులు, గోషిక నరహరి, చింతకింది కిషోర్ తదితరులు పాల్గొన్నారు.