బహిరంగ చర్చకు సిద్దం...! హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:36
Ready for open discussion...! Huzur Nagar Congress Party Leaders

హుజూర్ నగర్ అక్టోబర్ 1 ( ప్రజాజ్యోతి)./....హుజూర్ నగర్ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల అవినీతి అక్రమాల పై బహిరంగ చర్చ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఎమ్మెల్యే సైది రెడ్డి మీరు సిద్దమా... అని   కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ ఆధ్వర్యం లో మున్సిపాలిటీ లే అవుట్ ఆక్రమణల పై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల మాయం పై వివరణ ఇవ్వాల్సిన మున్సిపల్ కమీషనర్,చైర్ పర్సన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఇది దేనికి సంకేతం అని వారు ప్రశ్నించారు.గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మున్సిపాల్టీ లే అవుట్ అక్రమాల పై కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపు నిచ్చిందనీ  ఆ సమయం లో మీ పార్టీ నాయకులే చైర్మన్ గా ఉన్నారని. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైది రెడ్డికి గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవినీతి జరిగి ఉంటే ఇప్పుడు ఉన్నది మీ పార్టీ యేనని ప్రభుత్వం ప్రభుత్వం అధికారుల చే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని సవాల్ విసిరారు.ఈ సమావేశం లొ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ యరగాని  నాగన్న గౌడ్..పిసిసి డెలిగేట్ దోంగరి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్స్ కోతి సంపత్ రెడ్డి, రాజా నాయక్, సరిత వీరారెడ్డి,విజయ వెంకటేశ్వర్లు,దనమ్మజైలు, కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లయ్య,బచిమంచి గిరిబాబు,బంటు సైదులు,యడవెల్లి వీరబాబు, ముశం సత్యనారాయణ,మిన్నయ్య,రామమూర్తి, కుక్కడపు మహేష్ గౌడ్,తేజవత్ సైదులు నాయక్,సైదులు, రాము, తదితరులు పాల్గొన్నారు...