- నియమక పత్రాన్ని అందజేసిన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్ సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి :- తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ పార్టీ) తాండూరు మండల ప్రధాన కార్యదర్శిగా తాండూర్ మండలం చెంగోల్ గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రంపల్లి రాందాస్ లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూర్ మండలంలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం రాకేష్ గౌడ్ మాట్లాడుతూ తన పైన నమ్మకంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రపల్లి రాందాస్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి కోసం పెద్దల సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు సాయి రెడ్డి, తాండూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు రాములు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ ఉమాశంకర్, మహిళా నాయకురాలు శకుంతల, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, మల్కాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ హసేన్ పటేల్,తదితరులు ఉన్నారు.
- 4 views