రాజేశ్వర్ చిత్ర కళ సజీవం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:23
Rajeshwar's film art is alive

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి),.///.. రాజేశ్వర్ నాన్నూట కుంచె నుంచి జాలువారిన చిత్రాలు చాలా అధ్బుతం గా వున్నాయని, ఆయన గీసిన వర్ణ చిత్రాల్లో సజీవం వుట్టిపడుతుందని ఎం ఎల్ సి బండా ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు హరిత కాకతీయ లో రాజేశ్వర్ సోలో పెయింటింగ్ గాలరీ ని బండా ప్రకాష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి చిత్రాల ప్రదర్శన నిర్వహించడం సంతోషం అని అన్నారు. రాజేశ్వర్ వేసిన చిత్రాలు వేటికవే సాటి అని అన్నారు. తెలంగాణ జీవన విధానం, సంస్కృతి ని ప్రతిబింబించే చిత్రాలు ఈ గాలరీ లో ఉంచామని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలిపారు. నాలుగు రోజుల పాటు ఈ ఆర్ట్ గాలరీ హరితలో అందుబాటులో వుంటుందని, నగర వాసులు గాలరీ నీ సందర్శించాలని కోరారు. అనంతరం బండా ప్రకాష్ నన్నూ ట రాజేశ్వర్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ సంబారి సమ్మరావు, పర్యాటక శాఖ అధికారులు లోకేష్, కొమరయ్య, వంశీ మోహన్, ఖాదర్ పాషా, శరత్, ప్రముఖ సామాజిక కార్యకర్త నిమ్మల శ్రీనివాస్, యన్ ఎస్ ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు్