రఘు థియేటర్లో కనీస సౌకర్యాలు నిళ్లు

Submitted by Kancharla Nara… on Sun, 11/09/2022 - 20:18
Raghu theater lo kaneesa soukaryaalu nillu

చర్ల, సెప్టెంబర్ 11, ప్రజాజ్యోతి: చర్ల మండల కేంద్రంలోని రఘు థియేటర్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ రఘు థియేటర్లో కనీస సౌకర్యాలు లేనందున వీక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సరిపడా బాత్రూంలు లేవని ఉన్న ఒక్క బాత్రూం అపరిశుభ్రంగా ఉందని, థియేటర్ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని తగిన శుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని అన్నారు. టికెట్ ధరలు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వెహికల్ పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో తగిన నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్లక్ష్య ధోరణితో థియేటర్ నడుపుతూ అధిక టికెట్ ధరలు వసూలు చేస్తూ, ఏజెన్సీ ప్రజలను మోసం చేస్తున్న థియేటర్ యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని, థియేటర్లో పని చేసే వర్కర్లకు చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ప్రజాపంద మండల నాయకులు లంక వెంకట్, పాలెం చుక్కయ్య, ముసలి సతీష్, సభ్యులు శివ, నాని తదితరులు పాల్గొన్నారు.