భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి - కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 16:27
Pujas should be performed with devotion - Congress Party Municipal Floor Leader Chintala Chandra Reddy

హలియా,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి): భక్తిశ్రద్ధలతో కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీలో స్వయంభూశ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో చంద్రారెడ్డి దీప్తి దంపతులు సతి సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయానికి విచ్చేసిన దంపతులకు నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వసంత్ కుమార్,గుండెబోయిన చరణ్, అన్నేబోయిన మనోహర్,సురభి మహేష్,దుండిగల్ గోపి,  సాయి,ఎడ్ల ఉదయ్,  మహేందర్,చేగొండి కౌశిక్, సునీల్,వనమాల మణిశంకర్, సురభి ప్రవీణ్,తదితరులు, పాల్గొన్నారు.