పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత ...... ఎమ్మేల్యే గాదరి కిషోర్ కుమార్

Submitted by arigenagaraju on Sat, 10/09/2022 - 10:51
Protecting the environment is everyone's responsibility MLA Gadhari Kishore Kumar

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ . పర్యావరణ  పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం 12వ వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించిన మట్టి వినాయకునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ.... . మట్టి గణపతి పూజ శ్రేయస్కరమని అన్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రజలు అత్యధికంగా మట్టి వినాయకులను పూజిస్తున్నారని తెలిపారు.అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తాటిపాముల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని ,మున్సిపల్ వైస్ చైర్మన్ సంకె పెళ్లి రఘునందన్ ,ఎంపీపీ నెమరుకొమ్ముల స్నేహలత రెడ్డి , జడ్పిటిసి అంజలి, శోభన్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.