గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలి

Submitted by srinu jogu on Fri, 30/09/2022 - 11:06
 Promises made to tribal children should be immediately enforced
  •  •పది శాతం రిజర్వేషన్లు జీవోను వెంటనే విడుదల చేయాలి 
  • •వికారాబాద్ జిల్లా ఐక్యవేదిక ఇంచార్జ్ విస్లావత్ రమేష్ నాయక

చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెప్టెంబరు 17వ తేదీన బంజారా భవన్ ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా వారంలో రోజుల్లో గిరిజన పదిశాతం రిజర్వేషన్ జీవో విడుదల చేస్తానని హామీ ఇచ్చి వారం రోజులు దాటినా గిరిజన రిజర్వేషన్ జీవో ఇప్పటి వరకు జీవో జారీ చేయలేదని ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలని వెంటనే జీవో విడుదల చేయాలని లంబాడీల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా ఇంచార్జీ విస్లావత్ రమేష్ నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి డిమాండ్ చేశారు. విస్లావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మాపై చిత్తశుద్ధి ఉంటే మాకిచ్చినా హామీలను వెంటనే నెరవేర్చాలని మీడియా సమావేశంలో అన్నారు జీవో విడుదల చేయని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పూనుకుంటామని అన్నారు లేని యెడల వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు