వీఆర్ఏల సమస్యలు ఇకనైనా పరిష్కరించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 12:52
The problems of VRAs should be resolved soon

వీఆర్ఏల జిల్లా సంఘం జేఏసీ చైర్మన్ గోబీ నరసయ్య

 పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న వీఆర్ఏల సమ్మె 66 వ రోజుకు చేరుకున్న  సందర్భంగా  సూర్యాపేట జిల్లా వీఆర్ఏల సంఘం జెఎసి జిల్లా చైర్మన్ గొబ్బి నరసయ్య మాట్లాడుతూ, అయ్యా ముఖ్యమంత్రి మా గోడు పట్టించుకోండి జీతాలు లేక కుటుంబ సమస్యలు తీర్చలేక సతమతమవుతున్న  మా పిల్లల చదువులు వెనుకబడి పోతున్నాయి అయ్యా మా సమస్యను పరిష్కరించండి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు , అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు పఠాన్ జానీ పాషా, ఉపాధ్యక్షులు మధ్యల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి పద్మ నాగయ్య, వెంకటయ్య, నరేష్, జానయ్య, ప్రభాకర్, జానీ పాషా, వెంకన్న, నరసయ్య, జాన్ మియా, రాజు, యాదగిరి, వెంకటేష్, ఎల్లమ్మ, రాణి ,లక్ష్మమ్మ, పిచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు