యాదాద్రి సెప్టెంబర్ 27 (ప్రజాజ్యోతి న్యూస్): భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్రాలు కృషి చేయాలని ఓ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాల (93వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు. ఈ ఉద్యమాన్ని ఊరూర,గడప గడపకు తీసుకెళ్ళాలని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం కు అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు.అలాగే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్, రావుల రాజు,బండారు శివ శంకర్,రాసమల్ల సుదర్శన్, ధరణికోట నర్సింహ, జాగిల్లపురం అయిలయ్య,ఇంజ పద్మ, ఈర్లపల్లి వెంకటేష్,భానోతు బాలన్, మురళీ మోహన్, నలమాసు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
- 2 views