చౌటుప్పల్ సెప్టెంబర్ 23( ప్రజా జ్యోతి) ..///. మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన గుడ్డేటి జంగయ్య వయస్సు 24 సంవత్సరాలు వృత్తి లారీ డ్రైవర్, దేవరపల్లి, వెస్ట్ గోదావరి జిల్లా గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపైన నిలిపిన లారీని, జంగయ్య ప్రయాణిస్తున్న లారీ , వెనక నుండి ఢీకొనడంతో, తీవ్ర గాయాల పాలైన జంగయ్య కు రెండు కాళ్లు విరిగిపోయాయి, గాయాలపాలైన జంగయ్యను రాజమండ్రిలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరలించారు. జంగయ్యను పరిశీలించిన డాక్టర్లు ఆపరేషన్ కు పది లక్షల రూపాయలు ఖర్చువుతుందని తెలిపారు, నిరుపేద కుటుంబానికి చెందిన జంగయ్య తల్లి గుడ్డేటి మల్లమ్మ తన కొడుకు ఆపరేషన్ ఆర్థిక సహాయం అందించి ప్రాణాలకు కాపాడాలని కోరుతున్నారు. ఫోన్ పే నెంబర్9912148922.
- 1 view