ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ ముదిరాజ్

Submitted by Mdrafiq on Tue, 30/08/2022 - 14:45
Pitla Nagesh Mudiraj is the state president of Mudiraj Seva Samiti

చండూర్ ఆగస్టు 30( ప్రజా జ్యోతి)నల్లగొండ జిల్లా:

రాష్ట్రంలోని ముదిరాజులను బిసి డిc నుండి బిసి ఏ లో చేర్చాలని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం చండూర్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలోని ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నారు.మునుగోడు నియోజకవర్గంలోని 6 మండలాలలో ముదిరాజ్ భవనాలను నిర్మించాలన్నారు.

ముదిరాజుల జాతిపిత కొరివి కృష్ణ స్వామి విగ్రహాన్ని చండూర్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన జీవిత విశేషాలను యువతకు తెలియజేయటానికి సెప్టెంబర్ 18 న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముదిరాజ్ సేవాసమితి మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు గండూరి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల అధ్యక్షులు, స్థానిక నాయకులు యాదగిరి ,సునీత, యాకయ్య, సురేష్, వెంకన్న, చక్రి తదితరులు పాల్గొన్నారు.