పీజీ కళాశాల అకాడమిక్ బ్లాక్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మేల్యే

Submitted by Ashok Kumar on Thu, 08/09/2022 - 15:23
PG College Academic Block Bhumi Puja was done by MLA

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 08 :  గద్వాల జిల్లా కేంద్రంలోని  నది అగ్రహారం సమీపంలో పీజీ కళాశాల  ఆవరణలో గురువారం రూ.10.50 కోట్లతో నిర్మించే కళాశాల నూతన అకాడమిక్ బ్లాక్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది.భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ , ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్ మురళి, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్  రాథోడ్, పీజీ కాలేజ్ లెక్చరర్స్, సిబ్బంది,  తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.