దళిత మహిళా సర్పంచ్ దిష్టిబొమ్మ ను దహనం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలి

Submitted by mallesh on Thu, 29/09/2022 - 12:46
The people who burnt effigy of Dalit woman sarpanch should be arrested immediately

చౌటుప్పల్ సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి)..//..  చిన్న కొండూరు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దహనం చేయడానికి నిరసిస్తూ గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మత్య దేవేందర్, బోయ దేవేందర్ లు మాట్లాడుతూ దళిత వర్గాల నాయకులను అవమాన పరిచేల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే, మాదిగల ఆత్మగౌరవం కోసం ,మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేపడతామన్నారు. దళిత మహిళా సర్పంచ్ దిష్టిబొమ్మను దహనం చేసిన వ్యక్తులపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కైతాపురం సర్పంచ్ గుడ్డేటి యాదయ్య, చెక్క బాలకిషన్, కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, సుక్క సుదర్శన్, సుక్క అర్జున్, బోయ గణేష్, ఆరుట్ల లింగస్వామి, బొడ్డు శ్రావణ్ కుమార్ , బోయ సంపత్, బోయ రామచంద్రం, బోయ శీను తదితరులు పాల్గొన్నారు.