ప్రజలకు ఎల్లప్పుడూ అమ్మవారు ఆశీస్సులు కలుగాలి

Submitted by p naresh on Mon, 03/10/2022 - 13:12
People should always be blessed by Amma

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

సరస్వతీ మాత అలంకరణలో అమ్మవారి దర్శనం 

కల్వకుర్తి అక్టోబర్2 ప్రజా జ్యోతి./.... ప్రజలకు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారుశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి 
దేవి దేవాలయం లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు  సరస్వతిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిందిఉదయం నుండి అభిషేకం, అలంకరణ, దంపతులచే సాముహిక కుంకుమార్చన జరిపించారు కార్యక్రమానికిముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు, వారికి దేవాలయ కమిటీ ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే  గాంధీ చిత్రపటానికి మాల వేసి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎల్లప్పుడూ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరారు అనంతరం
ఎమ్మెల్యే  దేవాలయ ట్రస్ట్ చైర్మన్  జూలూరి రమేష్ బాబు  మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం సన్మానించారు
 ఉత్సవ కమిటీ సభ్యులు గాంధీ జయంతిని పునస్కరించుకొని పట్టణంలోని అన్ని గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపారు
గాంధీ జయంతి సందర్భంగాపారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ: ఆలయ ట్రస్ట్ చైర్మన్  జూలూరి రమేష్ బాబు  ఆధ్వర్యంలో  గాంధీ జయంతి సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పుర చైర్మన్  యడ్మ సత్యం, ఎంపీపీ మనోహర, వైసిపి గోవర్ధన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, ఆప్షన్స్ సభ్యులు కుడుముల మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ సౌజన్య జనార్ధన్ రెడ్డి, తిరుపతయ్య యాదవ్, దేవాలయ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టిశ్రీను, ప్రవీణ్, సంబురమణ, కల్మిచర్ల రమేష్, శ్రీధర్, వెంకటేష్, గోపాల్, ఆలయ సభ్యులు తదితరులు ఉన్నారు