ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మళ్లీ గొడవలు షురూ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 10:04
In the peaceful village, the quarrels started again

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్12 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు సామాజిక వర్గాలు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గ్రామాన్ని సందర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

ఘర్షణ లో గాయపడ్డ క్షతగాత్రుడిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న గ్రామం మళ్లీ గొడవలు మొదలవడంతో గ్రామస్తులు అలజడికి లోనవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ వర్గం దాడి చేస్తారు అని భయాందోళనలకు గురవుతున్నారు.భయం గుప్పెట్లో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గద్వాల డిఎస్పి రంగస్వామి సోమవారం ఇరువర్గాలను పిలిపించుకొని మాట్లాడారు.