జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీసీసీ సభ్యులకు సన్మానం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 15:00
PCC members were felicitated under the auspices of the District Congress Committee

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//..  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ నివాసంలో శనివారం ఇటీవల టిపీసీసీ సభ్యులు గా నియామకం అయిన బోథ్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమూద్ ఖాన్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడి పెళ్లి నగేష్ లను ఘణంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో టి పిసిసి సభ్యులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే అకుంఠిత దీక్షతో పనిచేస్తారో వారికి తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్ లో మంచి ప్రాధాన్యత ఇస్తుంద ని అని తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ మెంబర్లుగా ఎన్నికైన మహమూద్ ఖాన్, గుడి పెళ్లి నగేష్ ఇరువురు మాట్లాడుతూ తమ పై నమ్మకం ఉంచి పీసీసీ మెంబర్లు గా బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, జిల్లా సేవా దళ్ చైర్మన్ మోతీరాం, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సెడ్మకి ఆనంద్ రావ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్,జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లే శివాజీ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎస్సి సెల్ చైర్మన్ రాహుల్ చంద్రాల,బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సామన్ పెళ్లి శేఖర్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇమామ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాదిక్ ,  సిరికొండ మైనార్టీ సెల్ చైర్మన్ రంజాన్, పట్టణ మైనారిటీ సెల్ చైర్మన్ ఎండీ.మోషీన్ పటేల్, జిల్లా బీసీ సెల్ నాయకులు సంగరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బొంగురాల నారాయణ, మైనారిటీ నాయకులు రసూల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.