మహాలక్ష్మి దేవి అశ్వత్ నారాయణ స్వామివారి శాంతి కళ్యాణ వేడుకలో పాల్గొన్న: ఎమ్మెల్యే సైది రెడ్డీ

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 16:52
Participated in Shanti Kalyana ceremony of Mahalakshmi Devi Aswat Narayana Swami: MLA Saidi Reddy

నెరేడుచర్ల, సెప్టెంబర్29(ప్రజాజ్యోతి):  నేరేడుచర్ల శ్రీ విజయ దుర్గదేవాలయం శ్రీదేవి నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి గురువారం శ్రీ నింబమహాలక్ష్మి దేవి అశ్వత్ నారాయణ స్వామివారి శాంతి కళ్యాణం మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం కొనతం గోపి రెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి సంధ్య దంపతులచే నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డివిచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. భక్తులు వేలాదిమందిగా అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొనతం ఆదిరెడ్డి,కొనతం చిన్న వెంకట్ రెడ్డి, నాగండ్ల శ్రీధర్ , కట్ట గణేష్ రెడ్డి , ఎడవెల్లి వెంకటరెడ్డి , శంకరాచారి యారవ సురేష్ , మన్నెం దుర్గారావ్,పోనుగోటి శ్రీనివాస్ రావు, హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.