ప్రభుత్వ ఆసుపత్రి లో సెమీ క్రిస్మస్ వేడుకలు

Submitted by Srikanthgali on Fri, 23/12/2022 - 16:30
ప్రభుత్వ ఆసుపత్రి లో సెమీ క్రిస్మస్ వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రి లో సెమీ క్రిస్మస్ వేడుకలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 23, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ బండారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కుమార్ స్వామి మరియు ఆర్తో హెచ్ ఓ డి నరసింహారావు మరియు స్థానిక కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి పాల్గొని కేకును కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు. తదనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని తెలిపారు. ఏసుక్రీస్తు ఎప్పుడు ప్రేమ, కరునలను, క్షమను కలిగి ఉండాలని బోధించారాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తూ పండుగ ను ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దుస్తులు పంపిణీ చేసినారు అని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ మెడికల్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షులు బండారి, స్టాఫ్ నర్సింగ్ సూపర్డెంట్ లు భారతి, భూవమ్మ, మరియు జిల్లా అధ్యక్షులు రాజు, ఉదయ, శీను, మహేందర్, గంగా, హైమావతి విజయలక్ష్మి,మరియు నర్సులు సిబ్బంది మరియు ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.