మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుంది ౼ జిల్లా కలెక్టర్

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 14:14
 Only when the country moves forward taking the example of the Mahatma ౼ District Collector

◆ జిల్లావ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 : జాతిపిత మహాత్మా గాంధీ 153 వ, జయంతి వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించారని, ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల తాసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఆర్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.