అడుగడుగునా ఆటంకాలు: సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాలపురం సర్పంచ్ నాగ సైదయ్య

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:39
Obstacles at every step: Gopalapuram Sarpanch Naga Saidiah who expressed his anger in the general meeting

హుజుర్ నగర్ అక్టోబర్ 1 ( ప్రజా జ్యోతి) :  గ్రామ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా టిఆర్ఎస్ నాయకులు  అడ్డుకుంటున్నారని గోపాల పురం సర్పంచ్ నాగ సైదయ్య అన్నారు.శనివారం హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  జరిగిన సర్వసభ్య సమావేశంలో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల పనితీరును వారికి సహకరిస్తున్న పాలకుల పైన తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు.  కాంగ్రెస్  పార్టీ సర్పంచ్ కావడం వలన తమ గ్రామం గోపాలాపురం అభివృద్ధికి  తోడ్పాటును అందించకుండా అధికార పార్టీ నాయకులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ తనను ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు.గ్రామపంచాయతీ రికార్డులను డిఎల్పిఓ శ్రీరాములును పురమాయించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రికార్డులు ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.