పౌష్టికాహారమే దేశ ప్రగతికి సోపానం సీపిడీఓ అవంతిక

Submitted by srinivas on Thu, 29/09/2022 - 16:22
Nutrition is the stepping stone to the country's progress CPDO Avantika

రేగొండ,సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి),..///  రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో  గురువారం రోజున పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.  కిషోర బాలికలు, గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసు కోవాలని  సిపిడిఓ అవంతిక  సూపర్వైజర్ సంధ్యారాణి   లు సూచించారు.   సర్పంచ్  గంగుల రమణారెడ్డి అధ్యక్షతన ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణీలు, శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ముద్దామల్ల రేణుక దేవి, ఆర్. సరోజన కొడవట0చ  సెక్టర్ అంగన్వాడి టీచర్లు గ్రామ పంచాయతీకార్యదర్శి, మాచపక శ్రీనివాస్, ఆశావర్కర్లు,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.