రేగొండ,సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి),../// రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో గురువారం రోజున పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. కిషోర బాలికలు, గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసు కోవాలని సిపిడిఓ అవంతిక సూపర్వైజర్ సంధ్యారాణి లు సూచించారు. సర్పంచ్ గంగుల రమణారెడ్డి అధ్యక్షతన ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణీలు, శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ముద్దామల్ల రేణుక దేవి, ఆర్. సరోజన కొడవట0చ సెక్టర్ అంగన్వాడి టీచర్లు గ్రామ పంచాయతీకార్యదర్శి, మాచపక శ్రీనివాస్, ఆశావర్కర్లు,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
- 4 views