జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి

Submitted by Sathish Kammampati on Mon, 12/09/2022 - 11:57
National Unity Diamond Festivals should be organized in full force
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

 చిట్యాల సెప్టెంబర్ 12(ప్రజాజ్యోతి) ఈ నెల 16వ తేదీనా నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన ఏర్పాట్లపై సోమవారం నాడు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి పట్టణంలోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా 16న నిర్వహించబోయే కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు, జన సమీకరణ, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ (బిసి వెల్ఫేర్ జిల్లా అధికారి) పుష్పలత, నల్గొండ డిఎస్పి(స్పెషల్ బ్రాంచ్) రమేష్, నకిరేకల్ ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్, నార్కట్ పల్లి ఎస్సై రామక్రిష్ణ, పాల్గొన్నారు.