అచ్చంపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి. బల్మూర్ మండలంలోని పోలిశెట్టి పల్లి గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను సోమవారం కొండనాగుల సింగిల్విండో చైర్మన్ నరసయ్య యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ మాజీ సర్పంచ్ రామచంద్రన్ డైరెక్టర్ అంజిరెడ్డి తిరుపతయ్య రాము జంగి రెడ్డి సాయిలు సురేష్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.చీరలు పంపిణీ చేస్తున్న చైర్మన్.
- 1 view