కుంటపల్లి సర్పంచ్ ని పరామర్శించిన నల్లు రామచంద్రారెడ్డి

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 16:50
 Nallu Ramachandra Reddy visited Kuntapalli Sarpanch

తుంగతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి); మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి అమృతా రెడ్డి గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తుంగతుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్ర రెడ్డి  అమృతా రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఏ రజాక్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోడి శ్రీనివాస్, మద్దిరాల వైస్ ఎంపీపీ శ్రీరామ్  రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.