"టచ్ అనాధాశ్రమంలో ఘనంగా ముయ్యలి ఎల్లమ్మ వర్ధంతి వేడుకలు"

Submitted by Kramakanthreddy on Thu, 29/09/2022 - 11:10
Mujyali Ellamma's death anniversary celebrated at Touch Orphanage"

-74 మంది అనాధలకు పండ్లు, అన్నదాన కార్యక్రమం చేసిన ముయ్యలి చెన్నయ్య, కుటుంబ సభ్యులు

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  కీర్తిశేషులు ముయ్యల ఎల్లమ్మ  ద్వితీయ వర్ధంతి సందర్భంగా అప్పన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి టచ్ అనాధాశ్రమంలోని 74 మంది అనాధలకు ముయ్యలి చెన్నయ్య ,వారి కుటుంబీకులు  బుధవారం మధ్యాహ్నం పండ్లు ఫలహారాలు పంచి, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ముయ్యలి ఎల్లమ్మ కుమారుడు రామస్వామి మాట్లాడుతూ మా అమ్మగారిని గుర్తు చేసుకుంటూ ఆమె ద్వితీయ సంవత్సరీకం సందర్భంగా అనాధ బాల బాలికలతో గడపడం తమకు చాలా సంతోషంగా ఉన్నదని, తమ కుటుంబంలో పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకలకు అనాధాశ్రమంలో అన్నదానం చేసి సాయంత్రం వరకు ఆ చిన్నారులతో గడుపుతామని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన అనాధాశ్రమం లోని పిల్లలకు తాము ఒంటరివారమనే ఆలోచన రాదని ఆయన అన్నారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎదిర,4వ వార్డు  కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటికొండ రాములు, రఘునాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది.