పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): దేవి నవరాత్రి ఉత్సవాలో భాగంగా మండల పరిధిలోని అనంతారం గ్రామ పంచాయతీ వద్ద దసరా పండుగ,దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన దుర్గ భవాని యూత్ దుర్గ మాత వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా ఎంపీపీ నెమ్మది బిక్షం పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గ భవాని యూత్ సభ్యులు ఆయనకు శాలువలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.సింగిల్ విండో చెర్మెన్ నాతల జానకి రాంరెడ్డి.దంతాల వెంకటేశ్వర్లు. చిటేపు నారాయణ రెడ్డి మాలిగి రెడ్డి జనార్దన్ రెడ్డి.ధర్మ రెడ్డి దుర్గ భవాని యూత్ ఉత్సాహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- 9 views