జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎంపీపీ రాధ జంగయ్య

Submitted by md yusuf on Sat, 17/09/2022 - 15:27
 MP Radha Jangaiah hoisted the national flag

ఉర్కొండ సెప్టెంబర్ 17(ప్రజా జ్యోతి) //. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఎంపీపీ రాధ జంగయ్య చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను జాతి నిర్మాతలను నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనీ, ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నేటికీ 75 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శాంత కుమారి రవీందర్ కోఆప్షన్ కాలీం పాషా సర్పంచ్ కొమ్ము రాజయ్య తెరాస మండల అధ్యక్షులు వీరారెడ్డి ఉప సర్పంచ్ నారాయణ వార్డ్ మెంబెర్ కిట్టు మండల నాయకులు కొమ్ము శీను బండి మల్లేష్ టిఆర్ఎస్ యువ నాయకులు కాటం మనోహర్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఎంపీడీఓ ప్రభాకర్ ఎంపిఓ వెంకటేశ్వర్లు సూపెరడెంట్ లక్ష్మమ్మ గారు జూనియర్ అసిస్టెంట్ రవి ఎంపీడీఓ స్టాఫ్ వార్డ్ మెంబర్లు గ్రామ టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.