- మధిర తదితర నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాలకు నామ హాజర్
ఖమ్మం, సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి.టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నామ మధిర, తదితర నియోజకవర్గాల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధిరలో జరిగే ర్యాలీ, కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి పాల్గొంటారు. మధిర అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగే వజ్రోత్సవ వేడుకల్లో కూడా నామ, స్థానిక నాయకులతో కలిసి పాల్గొంటారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ నామ కోరారు.