సింగిల్ విండో గోదాం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Submitted by VadlaVijayKumarChari on Mon, 03/10/2022 - 15:41
MLA Patnam Narender Reddy laid the foundation stone of the single window warehouse

కొడంగల్, అక్టోబర్ 3(ప్రజాజ్యోతి)./...కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ నిజాం పాషా కలిసి సింగిల్ విండో గోదాం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కోటి 84 లక్షల రూపాయలతో ఈ గోదాం తయారు చేస్తున్నామని సందర్భంగా వారన్నారు అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దళిత బంధు వాహనాలను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల కోసం వారి జీవన ఉపాధి కోసం వాహనాలను ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే చెందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్ ఎంపీపీ విజయ్ కుమార్ పటేల్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు