ఎమ్మెల్యే స్థాయి మరిచిపోయి గువ్వల బాలరాజు దాడులకు పాల్పడుతున్నాడు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 12:43
MLA level is forgotten   Guvwala Balaraju is committing attacks

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

అచ్చంపేట సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి),.//  ఎమ్మెల్యే స్థాయి మరిచిపోయి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గిరిజనులు గిరిజన నేతరులపై దాడులకు పాల్పడుతూ అసభ్య పాదాజాలంతో మాట్లాడుతున్నాడని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విమర్శించారు గురువారం అచ్చంపేట మండలంలోని గుంపన్పల్లి గ్రామానికి చెందిన లస్కర్ విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందగా గురువారం అతని కుటుంబాన్ని.పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ సర్పంచి ఆధ్వర్యంలో గిరిజనలు గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగా వారిని అసభ్య పాదజాలంతో మాట్లాడి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడులకు దిగడం ఏమైనా చర్య ఇక ని ఆగడాలు అచ్చంపేటలో సాగవని అమాయక ప్రజలపై దాడులు చేయడం కాదు వెనుకబడిన అచ్చంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వంశీకృష్ణ అయనకు సూటిగా ప్రశ్నించారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బహిరంగంగా ప్రజలు దాడులకు దిగుతారని ఆయన అన్నారు ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల పైనే దాడులు చేయడం అసభ్యంగా మాట్లాడడం అప్రజాస్వామిక మని వంశీకృష్ణ విమర్శించారు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ప్రాంతం నుండి పనిచేశారు కాని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.లాగా గుండా రౌడీ గా  ప్రవర్తించలేదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దుర్భసలాడిన గిరిజన నేతలకు లస్కర్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు ఉన్నారు.ఫోటో రైట్ అప్.లస్కర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న వంశీకృష్ణ.