నెరేడుచర్ల ,సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో కుక్కలు పందులు కోతులు విపరీతంగా పెరిగిపోయాయని పట్టణంలోని ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వెంటపడుతూ గాయాల పాలు చేస్తున్నాయని ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పట్టణం నుండి తరిమి వేసేల చర్యలు చేపట్టాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ వర్క్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం సమర్పించిన సామాజిక కార్యకర్తలు. ఈకార్యక్రమంలో సుంకర క్రాంతి కుమార్ జింకల భాస్కర్ కొప్పు రామకృష్ణ గౌడ్ షేక్ షాహిద్ ,పొనుగోటి యశ్వంత్ పాల్గొన్నారు
- 17 views