జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలను గూర్చి టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

Submitted by Sathish Kammampati on Thu, 15/09/2022 - 17:26
Meeting of TRS key workers on National Unity Diamond Jubilee celebrations

డా. గౌ. శ్రీ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం
మద్దిరాల మండల సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి  .ఈ రోజు మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో  మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, రేపు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం లో జరుగు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబరాలకు  మండలం లోని అన్ని గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘం ప్రతినిధులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ SA రజాక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్ రావు, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్  ఆకుల ఉప్పలయ్య, మండల ప్రచార కార్యదర్శి వడ్డాణం మధుసూదన్, మూరగుండ్ల సోమయ్య, బెడద వెంకన్న, మల్లాల నర్సయ్య, వల్లపు రమేష్,  గోల్కొండ ఉన్మల్లేష్ ,మండలం లోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.