ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆపద్బాంధవుడు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 10:54
 Matyulu Guntakandla Jagadish Reddy of Power Department is the man who saves those in danger.

పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామ నివాసి ఉప్పల మోహన్ రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి 5,00,000 ,(ఐదు లక్షల రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి కుటుంబానికి అండగా నిలిచారు ఈ సందర్భంగా మోహన్ రావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు దొరకడం మన అదృష్టం అని చెప్పారు మాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చిన నేను ఉన్న అనే ధైర్యం ఇచ్చిన మంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.