భారీగా బిజెపి పార్టీలోకి చేరికలు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 16:56
 Massive joins in BJP party

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  మహబూబాద్ జిల్లా నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండల కేంద్రంలో  వీరారెడ్డి పెద్ద తండాకు చెందిన యువకులు బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు బిజెపి నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బిజెపి కండువా కప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో కూడా వర్తించేలా వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు భారీగా చేరికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామ చంద్రరావు, కేసముద్రం మండల అధ్యక్షులు పొద్దున్న నరసింహారెడ్డి, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గుగులోతు రాంబాబు, మరియు వెంకట్ రెడ్డి, భాస్కర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, కలసాని ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సురేష్, ప్రకాష్ తదితర బిజెపి నాయకులు మరియు మండల నేతలు పాల్గొనడం జరిగింది.