మంత్రి చేతుల మీదుగా బెస్ట్ శ్రమశక్తి అవార్డు
అవార్డు అందుకున్న విజయలక్ష్మి
నిజామాబాద్, ప్రజాజ్యోతి, మే 1 :
ఉత్తమ శ్రమశక్తి అవార్డును బి అర్ ఎస్ కార్మిక విభాగం నాయకురాలు విజయ లక్ష్మి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా సోమవారం అందుకున్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రంలో సంఘటిత అసంఘటిత రంగాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులకు యూనియన్ లీడర్లకు వారి శ్రమను గుర్తించి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్మికులకు కర్షకులకు సంఘటిత కార్మికుల అసంఘటిత కార్మికులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్మికుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలు కార్మికుల పిల్ల కోసం తల్లి లక్ష్మి షాది ముబారక్ భవన నిర్మాణ కార్మికులకు భీమ సౌకర్యం ఆటో కార్మికులకు ట్యాక్స్ మాఫీ అంగన్వాడి టీచర్లకు వేతనాల పెంపు ఆశ వర్కర్ మధ్యన భోజనం కార్మికులకు బీడీ కార్మికులకు జీవన భృతి తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారు కార్మికుల పట్ల అండదండలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అన్ని రంగాల కార్మికులకు ముఖ్యమంత్రివర్యులు గుర్తిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బి అర్ ఎస్ కార్మిక విభాగం నాయకురాలు విజయలక్ష్మి కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి చేతుల మీదుగా బెస్ట్ సమశక్తి అవార్డు అందజేశారు. మేడే సందర్భంగా నన్ను గుర్తించిన ప్రభుత్వ పెద్దలకు విజయ లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో మరింత బాధ్యతతో పని చేస్తానని విజయలక్ష్మి ప్రకటించారు.
- 6 views