టీయూడబ్ల్యూజే జిల్లా మహా సభ లను విజయవంతం చేయండి

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:49
Make the TWJ District Maha Sabhas a success

జైనూర్ సెప్టెంబర్ 24:( ప్రజా జ్యోతి):  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహిస్తున్న టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే ప్రతినిధులు  కాంబ్లే అన్నారావు  పోలిపల్లి నరేందర్ కార్యవర్గ సభ్యులు రామేశ్వర పిలుపునిచ్చారు. శనివారం జైనూరు మండల కేంద్రంలో జిల్లా మహాసభల  పోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు కార్యక్రమానికి  సంఘం రాష్ట్ర  అధ్యక్షులు నగునూరి శేఖర్ గారు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   విరాహత్ అలీ సార్ గారు  అదేవిధంగా రాష్ట్ర జిల్లా ప్రముఖులు విచ్చేస్తున్న ఈ కార్యక్రమానికి ఏజెన్సీ రిపోర్టర్లు సంఘ బాధ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు  కాంబ్లేఅన్న రావు నరేందర్ పోలిపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు  రామేశ్వర్ పాత్రికేయ మిత్రులు శ్రావణ్ సాజిద్  ఆత్రం రాము  జి దత్త జకీర్ షర్ఫుద్దీన్ జలీల్ తదితరులు పాల్గొన్నారు