మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ  నాగబాబు

Submitted by lenin guduru on Wed, 23/11/2022 - 10:15
Enquiry

మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ  నాగబాబు

బచ్చన్నపేట,నవంబర్ 22, (ప్రజాజ్యోతి):-

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామ పంచాయతి పరిధిలోని సదాశివపేటలో నెల రోజుల క్రితం జరిగిన మహిళ గుండని సుభద్ర మృతి పట్ల సోమవారం జనగాం జిల్లా డిసిపీ కి తల్లి చంద్రమ్మ పిర్యాదు మేరకు పోలీసుల విచారణ ప్రారంభమైంది.మంగళవారం జనగాం జిల్లా నర్మెట సిఐ, బచ్చన్నపేట ఎస్సై లు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను,గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం డిసిపి కి నివేదిక ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.పిర్యాదు చేసిన తెల్లరే విచారణ చేప్పట్టిన పోలీసులకు తల్లి కృతజ్ఞతలు తెలిపింది.