లారీ, ద్విచక్ర వాహనం డీ ఘటనలో భార్యాభర్తలు దుర్మరణం

Submitted by sridhar on Sun, 04/09/2022 - 17:47
Lorry, two wheeler  Husband and wife died in the incident

వాజేడు, సెప్టెంబర్ 4, ప్రజాజ్యోతి: లారీ ద్విచక్ర వాహనం ఢీకొని భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామా సమీపంలోని 163 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం వాజేడు మండలంలోని చింతూరు గ్రామపంచాయతీ పరిధిలోగల లింగపేట గ్రామానికి చెందిన తోటపల్లి రమేష్ (39), తోటపల్లి స్వరూప (35) అనే ఇద్దరు దంపతులు స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై మండలంలోని పాయబాట్ల గ్రామానికి ఆదివారం కావడంతో ప్రార్థన నిమిత్తం చర్చికి వెళ్తున్న క్రమంలో అదే సమయంలో జగన్నాధపురం గ్రామంనుండి చింతూరు ఇసుక క్వారీకి వెళుతున్న లారీ సుందరయ్య కాలనీ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈసంఘటన తెలుసుకున్న వాజేడు ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించి మృతిచెందిన దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఓకేకుటుంబానికి చెందిన భార్యాభర్తలిద్దరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతిచెందిన వారికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో వాజేడు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.