ఎమ్మెల్యే ఫైళ్ల సమక్షంలో కండువా మార్చిన నాయకులు

Submitted by krishna swamy on Wed, 28/09/2022 - 09:52
The leaders who changed the scarf in the presence of MLA Files


భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).//...భూదాన్ పోచంపల్లి మండలంలోని వంకమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ నరసింహ గ్రామానికి చెందిన 100మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఫైళ్ల సమక్షంలో టీఆరెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల చేరిన నాయకులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చేరిన నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలకు మరియు  ఎమ్మెల్యే చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి జడ్పీటీసీ కోట పుష్పాలత మల్లారెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్ సర్పంచ్ల ఫోరమ్ మాండల అధ్యక్షుడు సామ రవీందర్ రెడ్డి ఎంపీటీసీల ఫోరమ్ మాండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్ సర్పంచ్ దోటి కుమార్ యాదవ్ టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.