హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి
ప్రముఖ సినీ నటుడు,మాజీ కేంద్రమంత్రి (ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) కృష్ణం రాజు మరణం పట్ల రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు.
తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనతో 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం సినిమా రంగానికి తీరని లోటని అన్నారు.
లోక్ సభ సభ్యునిగా,కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం బాధాకరమని మంత్రి అన్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు మంత్రి సత్యవతి రాథోడ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- 2 views