సుజిత్ రావు క్రికెట్ లీగ్ లో విజేతలు గా నిలిచిన కోరుట్ల ఎల్ సి సి జట్టు.

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 15:56
Korutla LCC team who won the Sujith Rao Cricket League.

◆కోరుట్ల జట్టును అభినందించిన కల్వకుంట్ల సుజిత్ రావు

మల్లాపూర్ సెప్టెంబర్ 03,ప్రజా జ్యోతి:మల్లాపూర్ మండలంలోని సంగెం శ్రీరాంపూర్ గ్రామంలో కల్వకుంట్ల సుజిత్ రావు క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన (ఎల్ సి సి) జట్టు అలాగే మెట్ పల్లి పట్టణానికి చెందిన (ఎంసీఏ) జట్టులు తలపడ్డాయి. దీనిలో భాగంగా కోరుట్ల ఎల్ సి సి విజేతలుగా నిలువగా మెట్పల్లి ఎంసీఏ జట్టు రన్నర్లుగా నిలిచారు.

ఈ ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్లో 8 పరుగుల తేడాతో కోరుట్ల టీం విజయ గంట మోగించింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల సుజిత్ రావు మాట్లాడుతూ యువత క్రీడల పైన ప్రాధాన్యత పెంపొందించడానికి ఈ క్రికెట్ లీగ్ను ప్రారంభించినట్లు వివరించారు. ఈ క్రికెట్ లీగ్ కోరుట్ల నియోజకవర్గస్థాయిలో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలుగా నిలిచిన కోరుట్ల (ఎల్ సి సి)జట్టు సభ్యులకి ట్రోఫీని అలాగే నగదును అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరిపెల్లి నరేష్,టీపీసీసీ ఫిషేర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మల్లపూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోతూ శేఖర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, కొరుట్ల పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏఆర్ అక్బర్,బద్దం సుధాకర్,ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక డైరెక్టర్ కళ్లెడ గంగాధర్,ఎండి రాజి,బద్దం సుధాకర్,మామిడి రాజశేఖర్ రెడ్డి, ఈపపెల్లి గణేష్,కూన రాకేష్, బైండ్ల శ్రీకాంత్, మోగిలి రాజేందర్,గంగాధర్,బద్దం శ్రీనివాస్,బద్దం రాము,గోపి,నరేష్,కరం సింగ్,సల్మాన్ అన్వర్ ,గంగోని శ్రీనివాస్,కొమ్ముల చిన్న రెడ్డి .తదితరులు పాల్గొన్నారు.