మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:03
Konda Laxman Bapuji Jayanti Celebrations at Mandal Praja Parishad Office

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి) ,..//ములుగు జిల్లా, వెంకటాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి సీతాదేవి ,ఏఈ రాజేష్ ,కార్యాలయ సిబ్బంది లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి,మలిదశ ఉద్యమాలలో పాల్గోన్న ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఇర్పా సత్యనారాయణ,టైపిస్ట్,  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.