నూతన పింఛన్దారుల గుండెల్లో ఆనందాన్ని నింపిన కేసీఆర్ ప్రభుత్వం...

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:54
KCR government has filled the hearts of new pensioners with joy...


జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన. భాగ్యలక్షి అంజయ్య...

బచ్చన్నపేట అక్టోబర్ 02.. ప్రజాజ్యోతి./...బచ్చన్నపేట మండలంలోని గోపాల్ నగర్ గ్రామంలో  నూతన ఆసరా పింఛన్లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు దసరా కానుకగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు వారి చేతుల మీదుగా అంద జేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవృద్ధులకు వితంతువులకు చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు  ఆసరా గా నూతన పింఛన్లు మంజూరు కాగా ఈరోజు వారికి పింఛన్ డబ్బులు వారికి అందించడంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ వద్ది ఎల్లయ్య, కార్యదర్శి కవిత ,వార్డు మెంబర్లు బొమ్మ నర్సింలు, పరశురాములు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.