ప్రజా జ్యోతి,యాదాద్రి జిల్లా ,సెప్టెంబర్20.../ కస్తూరి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాసాలమర్రి ని ఎనిమిది లక్షల సొంత నిధులతో సివిల్ వర్క్,విద్యుదీకరణ, ప్లంబింగ్ వర్క్, గ్రీన్ బోర్డులు ఫ్యాన్సీ ట్యూబ్ లైట్స్ సదుపాయాలు కల్పించి పాఠశాల మోడల్ పాఠశాలగా మౌలిక వసతులను కల్పించిన శ్రీ చరణ్ గారు నిజంగా అభినందనీయం జిల్లా విద్యాశాఖ అధికారి సి.నారాయణరెడ్డి అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెల్కలపల్లి పెంటయ్య గారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.కస్తూరి ఫౌండేషన్ ద్వారా పాఠశాలను రెనోవేషన్ చేసి అభివృద్ధి పరిచినందుకుగాను పాఠశాల పక్షాన, గ్రామ పెద్దల పక్షాన ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన ఉత్సవ కార్యక్రమం జరిగింది ఆత్మీయ దాతతో కస్తూరి శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానం చేయనైనది.. ఈ సందర్బంగా కస్తూరి శ్రీ చరణ్ మాట్లాడుతూ చదువు కు పేదరికం అడ్డు కాదని, విద్య ద్వారానే విద్యార్థులు సమాజంలో ఒక స్థాయిని పొందగలరని అందుకోసం యోజన బద్దంగా చదువుకోవాలని అన్నారు.
తదుపరి విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్,బాలికలకు సానిటరీ కిట్స్, ఎమ్ పి పి వాసలమర్రి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్, పెన్సిల్ ను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జై కృష్ణ, వాసాలమర్రి గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎస్ఎంసి చైర్మన్ సిహెచ్ బాలరాజు, గ్రామ సెక్రెటరీ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులుగ్రామ పెద్దలుయువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- 6 views