బల్లి పడ్డ ఆహారం తిని 25 మంది విద్యార్థుల అస్వస్థత
-
దేవరుప్పుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఘటన
దేవరుప్పుల, అక్టోబర్ 27, ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి భోజనంలో బల్లి పడ్డ ఆహారం తిని 25 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురి అయ్యారు. అందులో 10 మంది విద్యార్ధిని లు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా మిగతా విద్యార్థినిలు భోజనం చేయకుండా పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. స్థానికులు కూడా అక్కడికి వచ్చి పిల్లలకు మద్దతు పలికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధినుల కు చికిత్స కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై రమేష్ ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.