స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజాజ్యోతి ) :- పెయింటింగ్ లో రాష్త్ర స్థాయి అవార్డు పొందిన కడియం యువసేన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు జీడి ప్రసాద్ తాను పెయింటింగ్ వేసిన సీఐ అల్లె రాఘవేంద్ర ఫోటోను కడియం యువసేన నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సీఐ కి అందజేశారు. ఈ సందర్బంగా సీఐ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాఫర్ఘడ్ మాజీ జడ్పీటీసీ రాజేష్ నాయక్, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమకంటి నాగరాజు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి హఫీజ్, చిల్పూర్ మండల అధ్యక్షులు ఇల్లందుల విజయ్, తెరాస నాయకులు సింగపురం రవి , చింత సురేశ్ , భాస్కల రవి, తాటికొండ ఏసురత్నం, రాజు పాల్గొన్నారు.
- 4 views