తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 15 ( ప్రజా జ్యోతి ).హైదరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుమలగిరి మండలం గుండేపురి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్ యం యస్ చైర్మన్ మేడిద వీరయ్య, మాజీ వార్డ్ మెంబర్ బలిక సత్తయ్య, గుండ్ల ప్రేమయ్య,సంద చంద్రయ్య,గుండ్ల రాములు, మేడే లచ్చయ్య,వయ్యా నాగేష్,గుండ్ల అంజయ్య వారితో పాటు పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా టి ఆర్ ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
- 2 views