తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బిజెపితోనే సాధ్యమవుతుంది జిట్టా బాలకృష్ణారెడ్డి

Submitted by mallesh on Sat, 01/10/2022 - 10:54
Jitta Balakrishna Reddy's aspiration of Telangana movement is possible only with BJP

చౌటుప్పల్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన కోసం పనిచేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పరిధి లింగారెడ్డిగూడెం శుభం గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన, భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మండల స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందన్నారు, భారతీయ జనతా పార్టీ తోనే తెలంగాణలో ఉద్యమ ఆకాంక్ష నెరవేరుతుందని ప్రజల నమ్మి హుజురాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం నిలబడే పార్టీని రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి సీఎం కేసీఆర్ కు ఆర్థిక సహకారం అందించిన ఘనత రాజగోపాల్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా ప్రతినిధిగా గెలిచిన తనని ప్రలోభాలకు గురిచేసి పట్టుబట్టి,  మంత్రి జగదీశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు. ఆనాడు తన నాయకత్వం నచ్చి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన జగదీశ్వర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించినందుకే, తన పైన కక్ష సాధిస్తూ రాత్రికి రాత్రి  అక్రమ కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై అక్రమ కేసులు పెట్టించి, ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఓడించడానికి తన ఆస్తులను అమ్ముతానన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే పున్న శ్రీశైలం గౌడ్, జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, దూడల బిక్షం గౌడ్, బిజెపి మండల శాఖ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పంతంగి సర్పంచ్ భాతరాజు సత్యం, పెద్ద కొండూరు సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్, చిన్న కొండూరు సర్పంచ్ బక్క సప్న శ్రీనాథ్, కైతపురం సర్పంచ్ గుడ్డేటి యాదయ్య, సురుగు శ్రీనివాస్, దేవలమ్మ నాగారం మాజీ సర్పంచ్ వరకల మహేందర్ గౌడ్, పందుల శరత్, రేవెల్లి సత్యనారాయణ, పందుల వెంకటేష్, సిలువేరు రమేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.